21 February 2018

జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మంగ‌ళ‌వారం విప్ప‌గుంట నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టికే చౌట‌పాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌నతో క‌ర‌చాల‌నం ఇవ్వ‌డానికి పోటీ ప‌డ్డారు. అయితే మ‌హిళ‌లు, రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. మ‌హానేత పాల‌న‌లో త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, ఇప్ప‌డు బాబు పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యుల‌కు ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇవ్వ‌కుండా టీడీపీ నేత‌లు వేధిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ త్వ‌ర‌లో మంచి రోజులు వ‌స్తాయ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని ముందుకు క‌దిలారు. 

No comments:

Post a Comment