5 February 2018

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షం

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నెల్లూరు రైతులు పేర్కొన్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర కొవ్వూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రైతులతో వైయస్‌ జగన్‌ మమేకం అయ్యారు. నవరత్నాలతో జీవితాలకు ఓ భరోసా వచ్చిందని రైతులు, మహిళలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులంతా సస్యశ్యామలంగా ఉండేవారని, ఆయన మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా రైతులకు మేలు చేస్తారని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదన్నారు. అందుకే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని అందరం కోరకుంటున్నామని రైతులు, మహిళలు తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.20 కరెంటు బిల్లు కట్టేవార మని, ఇవాళ నెలకు రూ.300 బిల్లు కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రతి విత్తనంలో, మందులో కల్తీ చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ రావాలని మహిళలు నినదించారు.

No comments:

Post a Comment