5 February 2018

సరైన జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నాం

కొవూరు: సరైన జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మెరిట్‌ ప్రకారం మమ్మల్ని నర్సులుగా తీసుకున్నారని, ఇప్పటి వరకు రెగ్యులరైజ్‌ చేయలేదని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కొవూరులో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న నర్సులు వారి సమస్యను చెప్పుకున్నారు. రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. సమాన పనికి.. సమాన జీతం ఇవ్వడం లేదన్నారు. మా పిల్లల చదువుల కోసం మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

No comments:

Post a Comment