కోవూరు: వ్యవసాయ రంగానికి ప్రతిపక్షనే వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలకు రైతుల నుంచి విశేష స్పందన వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. కోవూరులో కొనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి కావాల్సింది సాగునీరు, రైతుకు కావాల్సింది ఆదాయమని, ఈ రెండిటి ఎజెండాతో వైయస్ఆర్ పనిచేశారన్నారు. అదే ఎజెండాతో వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. రైతుకు పెట్టబడికి రూ. 12,500, ఉచితంగా బోర్లు వేయిస్తానని, ఉచితంగా తొమ్మిది గంటల కరెంటు, సున్నా వడ్డీలు, రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి హామీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. వైయస్ జగన్ హామీలపై విశ్వాసంతో ఉన్న ప్రజలు ఆయన్ను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారన్నారు.
No comments:
Post a Comment