16 January 2018

అప్పలాయగుంటలో స‌మ‌స్య‌ల వెల్లువ‌

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని అప్ప‌లాయ‌గుంట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఇల్లు మంజూరు కావ‌డం లేద‌ని, మంచినీటి స‌మ‌స్య‌ను తీర్చాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వారి స‌మ‌స్య‌లు విన్న జ‌న‌నేత మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. 

No comments:

Post a Comment