16 January 2018

చెక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తా

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో చెరకు రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. చెరకు  ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పొయామని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ మూతపడిన ఫ్యాక్టరీలను వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు.  రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment