8 January 2018

బాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?


– చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం
– జన్మభూమి కమిటీ పేరుతో మాఫియా
–మరుగుదొడ్లకు కూడా లంచాలు అడుగుతున్నారు.
– పింఛన్లలో అసమానతలు కనిపిస్తున్నాయి.
–చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి.
– తిరుపతి, కాణిపాకం దేవస్థానాలకు పాలక మండలి కరువు
– ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
– ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలి.
– మీ పిల్లలను నేను చదివిస్తాను.
 – పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తా
– ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తా

చిత్తూరు: నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనిఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 56వ రోజు పూతలపట్టు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  

బాబు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ..
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సహకార రంగ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందుకు ఈ నియోజకవర్గానికి పక్కనే చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ కనిపిస్తోంది. ఇక్కడికి రాకముందు ఒక టెంట్‌ వేసి ఆందోళన చేపట్టి..నన్ను పిలిచారు. ఆ చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని చూçస్తే బాధనిపించింది. మన జిల్లాలో 6 ఫ్యాక్టరీలు ఉంటే రెండు మాత్రమే ప్రభుత్వానికి, మిగతావి ప్రవేట్‌ సంస్థలు. అదేంటో కాని చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా సహకార రంగంలోని రెండు చక్కెర పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సహకార రంగంలోని పరిశ్రమలు నడిచేలా చూడాలి. రైతులకు తోడుగా ఉండాలి. రైతులకు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలి. ఇదే జి ల్లాలో పుట్టిన చంద్రబాబు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తే బాధనిపిస్తుంది. చంద్రబాబు ఉన్నప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. అదే వైయస్‌ఆర్‌ వచ్చాక ఆ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించారు. మహానేత చలువ వల్ల ఆ ఫ్యాక్టరీలు మళ్లీ పదేళ్లు నడిచాయి. మళ్లీ మన ఖర్మకొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ వెంటనే రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇవాళ పంట పండించడానికి ఖర్చులు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సహకార రంగంలోని రెండు ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ప్రైవేట్‌ రంగానికి చెందిన ఫ్యాక్టరీలు వాళ్లకు గిట్టుబాటు అయ్యే రేటుకు చెరుకును కొనుగోలు చేస్తున్నారు. ఇదే రైతన్నలు ఇష్టం లేకపోయినా చెరుకును అమ్ముకోవాలంట. రైతులు బెల్లం చేసుకొని బయట అమ్ముకోవటం చంద్రబాబుకు ఇష్టమట. చెక్‌ పోస్టులు పొట్టి నల్లబెల్లాన్ని అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. భూమిని బట్టి నల్ల బెల్లం దొరుకుతుంది. రైతులను నష్టపరిచేందుకు, ప్రైవేట్‌ ఫ్యాక్టరీలకు మేలు చేసేలా జీవోలు జారీ చేస్తున్నారు.

పథకం ప్రకారం డైరీలు మూత వేయించాడు
చంద్రబాబు ఒక పథకం ప్రకారం జిల్లాలోని డైరీలను మూత వేయించాడని వైయస్‌ జగన్‌ అన్నారు. ఇదే చంద్రబాబు రైతులకు తోడుగా ఉండాల్సింది పోయి..మన ఖర్మకొద్ది ఇదే చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్యాక్టరీని పెట్టారు. ఆయన డైరీ కోసం చిత్తూరు డైరీని నాశనం చేశారు. చిత్తూరు డైరీలో తనకు నచ్చిన వారితో పాలన మండలి ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం మూత వేయించాడు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నష్టాల బాట అంటూ మూసి వేయించారు. సహకార రంగ పాల వ్యాపారంలో రైతులకు గిట్టుబాటు ధర ఉంటుంది. ఈ మనిషిని చూసినప్పుడు ముఖ్యమంత్రిగా అర్హుడా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

మహానేత పాలనను గుర్తుకు తెచ్చుకోండి
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్‌ జగన్‌ అన్నారు. మహానేత బతికి ఉన్నప్పుడు హంద్రీనీవాకు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేయించారు. మిగిలింది ఆ కాల్వను తీసుకొచ్చి చిత్తూరులో కలపడమే. చంద్రబాబు నోట్లో నుంచి పచ్చి అబద్ధాలు తప్ప వేరేవి రావడం లేదు. చంద్రబాబు సీఎం కాకముందే రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క కాల్వ కూడా తవ్వలేకపోతున్నారు. వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే. ఇదే ముఖ్యమంత్రి నెలకొసారి ప్రైవేట్‌ విమానం ఎక్కి సింగపూర్, జపాన్, రష్యా, స్విజ్జర్‌ల్యాండ్‌ అంటూ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్తారు. సింగపూర్‌కు వెళ్తే ఈ రాష్ట్రాన్ని సింగపూర్‌ అంటారు. ఇలా ఏదేశం వెళ్తే ఆ దేశంలాగా మన రాష్ట్రాన్ని చేస్తామని మోసం చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 400 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొదాంట్లో 30 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో వేలకొద్ది ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు సీఎం కాగానే గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు విఫరితంగా కరెంటు బిల్లులు, రాయితీలు పెంచారు. ఇలా దగ్గరుండి రేట్లు పెంచితే ఎలా నడుస్తాయి. 

పాలక మండలి ఏదీ?
ఇదే చంద్రబాబుకు పరిపాలనపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అనడానికి ఒక్క ఉదాహరణ. జిల్లాలో తిరుపతికి పాలక మండలి లేదు. ఇప్పటికి 8 నెలలుగా పాలక మండలికి బోర్డు లేదు. కాణిపాకం గుడిలో అయితే పాలక మండలి అన్నది గత మూడేళ్లుగా లేదు.

డాక్టర్లేరి?
పూతలపట్టు వెళ్లే రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి ఏటా వంద మంది ఈ రహదారుల్లో చనిపోతున్నారు. మన వద్ద రెండు కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ డాక్టర్లు ఉండటం లేదు. ప్రమాదం జరిగితే తిరుపతి, చిత్తూరుకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఇదే నియోజకవర్గంలో పింఛన్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. జన్మభూమి కమిటీ పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాలి. పింఛన్లకు 60 ఏళ్ల వయస్సు సరిపోదట..కాళ్లు, చేతులు లేకపోతే సరిపోదట..జన్మభూమి కమిటీలు సిపార్సులు చేయాలట. పై నుంచి కింద దాక అవినీతే. చంద్రబాబు పైన మేస్తున్నారు. మద్యం, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, చివరికి గుడి భూములు వదలకుండా చంద్రబాబు మేస్తున్నారు. కిందమాత్రం జన్మభూమి కమిటీలకు వదిలిపెట్టారు. 

 ఒక్కసారి ఆలోచించండి..
నాలుగేళ్ల పాలన మనమంతా చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇదే చంద్రబాబు తనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలట. ఒక్క ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటున్నారంటే ఆయన కళ్లు ఎక్కడున్నాయో ఆలోచించండి. అయ్యా చంద్రబాబు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని నీవు అంటున్నావు. ఈ నాలుగేళ్లలో నీవు మోసం, అవినీతి, అబద్ధాలు చెబుతున్నారు. ఇంతకు చంద్రబాబుకు సిగ్గు ఉందా?. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లులు షాక్‌ కొడతాయని అన్నారు. వస్తూనే కరెంటు బిల్లులు తగ్గిస్తా అని చంద్రబాబు అన్నారు. గతంలో కరెంటు బిల్లులు రూ.50, 70, 100 లోపు వచ్చేవి. ఇవాళ అదే బిల్లు రూ.500, 700, 1000 చొప్పున వస్తున్నాయి. కర్నాటక బార్డర్‌లో పెట్రోల్‌ పోయించుకుంటే లీటర్‌కు రూ.5 తక్కువగా ఉంది. రేషన్‌ షాపుల్లో ఇప్పుడు బియ్యం తప్ప మరేది ఇవ్వడం లేదు. మరోవైపు చంద్రన్న మాల్స్‌ పేరుతో దోపిడీకి తెర లేపారు. చంద్రన్న మాల్స్‌లో చక్కెర కేజీ 48, చింతపండు కేజీ రూ.290, పామాయిల్‌ రూ.70, గోదుమలు రూ.35 ఉంది. హోల్‌షెల్‌ ధర కన్న 40 శాతం తక్కువకు అమ్ముతున్నామని చంద్రబాబు మంత్రులు అంటున్నారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఉన్న జాబులు ఊడగొడుతున్నారు.
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలు అన్ని బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. నాలుగేళ్ల తరువాత బంగారం ఇంటికి వచ్చిందా?. నోటీసులు మాత్రమే ఇంటికి వస్తున్నాయి. రుణమాఫీ రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. 

ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు..
ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రావాలి. ఇదే చంద్రబాబును మనం క్షమిస్తే..రేపు చంద్రబాబు మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్దాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ అంటారు. అంతేకాదు ప్రతి ఇంటికి బెంజీ కారు కొనిస్తానంటారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి, హామీ నెరవేర్చకపోతే ఇంటికి పోవాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇందుకోసం వైయస్‌ జగన్‌కు మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామని నవరత్నాల ద్వారా మనం చెప్పాం. ఇందు కోసం సూచనలు, సలహాలు ఇవ్వమని మిమ్మల్నే కోరుతున్నాను.

నేను రెండు అడుగులు ముందుకు వేస్తా..
ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. చంద్రబాబు దృష్టిలో నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీల మీద ప్రేమ. పేదవాడి మీద ప్రేమంటే ఎలా ఉంటుందంటే నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజినీర్, డాక్టర్‌ కావాలి. సువర్ణయుగంతో నాన్నగారు పేదలను పెద్ద పెద్ద చదువులు చదివించి తోడుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలు ఇంజినీరింగ్‌ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ముష్టి వేసినట్లు రూ.30 నుంచి రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇవి కూడా ఏడాది నుంచి రావడం లేదని పిల్లలు చెబుతున్నారు. మిగిలిన డబ్బు ఆ పేదవాడు కట్టాలంటే సాధ్యమా? నాన్నగారు పేదవాడికి కోసం ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానున. మీ పిల్లలను నేను చదిస్తాను. అంతేకాదు విద్యార్థులకు అయ్యే హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ ఖర్చులు నేనే ఇస్తాను. ప్రతి ఏటా విద్యార్థికి రూ.20 వేలు ఇస్తాను. అంతేకాదు చిట్టి పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు వేస్తాను. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితే తల రాతలు మారుతాయి.

పింఛన్‌ రూ.2 వేలు ఇస్తాం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రూ. 2 వేలకు పెంచుతున్నాను. పెన్షన్‌ వయస్సు 60 సంవత్సరాల నుంచి 45 ఏళ్లకు తగ్గిస్తాం. వయస్సు పెరిగేకొద్దీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి వాటి కోసం వేరే వ్యక్తులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కాంట్రాక్టులకు మాత్రమే అంచనాల పేరుతో నిధులు కేటాయిస్తున్నారు. అవ్వతాతలకు మాత్రం పింఛన్లు పెంచడం లేదు. ఇవాళ పనులకు వెళ్తే గాని కడుపు నిండని పరిస్థితి నెలకొంది. అందుకే చెబుతున్నాను. పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. 

ఆడపడుచుల పేరుతో  ఇల్లు రిజిస్ట్రర్‌ చేస్తాం..
నాన్నగారి పాలనలో దేశం మొత్తం 47 లక్షలు ఇల్లు కడితే, ఒక్క ఏపీలోనే 48 లక్షల ఇల్లు కట్టారు. ఇవాళ ప్రతి పేదవాడికి చెబుతున్నాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇల్లు కట్టించడమే కాదు ఆ ఇంటికి ఆడపడుచు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేయించి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడితే ..వారికి డబ్బు అవసరమైతే బ్యాంకుల్లో రుణం పొందేలా చూస్తాను. పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని మాట ఇస్తున్నాను. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంత అప్పులు ఉన్నాయో ఆ మొత్తం కూడా నాలుగు దఫాలుగా ఆ డబ్బులు ఆ అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడతానని హామీ ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే నాకు చెప్పవచ్చు. ఎవరైనా నన్ను కలువవచ్చు. ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని మీ అందరికి కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

No comments:

Post a Comment