18 January 2018

ఈ ప్రభుత్వానికి కనికరం లేదు

చిత్తూరు: పేదల పట్ల, వారి ఆరోగ్యం పట్ల తెలుగు దేశం ప్రభుత్వానికి కనికరం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.  రేణిగుంట మండలం పరకాల గ్రామానికి చెందిన గౌతమి అనే నాలుగేళ్ల చిన్నారి క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పొయింది. ఆ పాపకు వైద్యం చేయించే స్థోమత లేక గురువారం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను చిన్నారి గౌతమి తల్లిదండ్రులు కలిశారు. తమ బిడ్డ క్యాన్సర్‌ కారణంగా కంటి చూపు కోల్పొయిందని, అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికే వైద్యం కోసం మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లో రూ.5 లక్షలు ఖర్చు చేశామని, ఇక వైద్యం చేయించేందుకు తమకు స్థోమత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ రకమైన వ్యాధులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేసేవారని,  ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇలాగే ఆలస్యం చేస్తే మరో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని వారు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి బాధ విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చిన్నారులకు కాంక్లీయర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వ్యాధులకు వైద్యం అందించడం లేదన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తామని, ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తామని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. జననేత హామీతో గౌతమి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment