చిత్తూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తేనే మెడికల్ విద్యార్థులకు మేలు జరుగుతుందని చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న కుషాల్ అన్నారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థులు మేము సైతం అంటున్నారు. చైనాలో మెడికల్ చదువుతున్న కుషాల్ అనే విద్యార్థి మంగళవారం వైయస్ జగన్ను కలిశారు. జింజో మెడికల్ యూనివర్సిటీలో తాను ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని చైనాలో పలుమార్లు ఆందోళన చేపట్టామన్నారు. ఈ పోరాటానికి ఆ దేశంలోని విద్యార్థులు కూడా మద్దతు తెలిపారన్నారు. వైయస్ జగన్ లాంటి నాయకుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం సంతోషంగా ఉందన్నారు. తామంతా వైయస్ జగన్కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
No comments:
Post a Comment