చిత్తూరు: సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిందని నగరి నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో ఆయా వర్గాల ప్రజలు మంగళవారం వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకే సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వచ్చినా తరువాత ఉన్న జాబులు పోయాయని యువత ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో బెంగుళూరులో ఉపాధి పొందుతున్నామని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తన ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకుంటున్నారని, వైయస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment