- జననేతకు అడుగడుగునా ఘనస్వాగతం
చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మార్మోగుతోంది. దారులన్నీ కూడా జగన్న్నినాదంతో హోరెత్తుతున్నాయి. చంద్రబాబు ఇలాఖాలో రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. ప్రజాసంకల్పయాత్ర నేడు 56వ రోజుకి చేరుకోగా.. మొరవపాటూరు నుంచి ఉదయం వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. కొండారెడ్డిపల్లి క్రాస్ నుంచి తలుపులపల్లి గ్రామం చేరుకొని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, టీ రంగం పేట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామం అనంతరం తిరిగి యాత్ర మొదలుపెడతారు. రంగంపేట క్రాస్ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. సీఎం సొంత గడ్డపై ప్రతిపక్ష నేతకు విశేష ఆదరణ లభిస్తోంది. మూడు రోజుల క్రితం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి వైయస్ జగన్కు సంఘీభావం తెలుపగా, నిన్న చంద్రబాబు సొంతూరు చంద్రగిరి నియోజకవర్గంలో జననేతకు బ్రహ్మరథం పట్టారు. ఇవాళ పూతలపట్టు ని యోజకవర్గంలో కూడా అదే ఆదరణ లభిస్తోంది.
పల్లెల్లో వెలుగు దివ్వె
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పల్లెల్లో వెలుగు దివ్వెగా మారుతోంది.. అవ్వాతాతల్లో, అక్కాచెల్లెళ్ల మనసుల్లో భరోసాను పెంచుతోంది.. మీ కష్టాలను పంచుకునేందుకు నేనున్నానంటూ ధైర్యం చెబుతోంది.. ప్రజా సంకల్పయాత్ర పల్లెలన్నీ దాటుకుంటూ నిన్న చంద్రగిరి నియోజకవర్గానికి చేరుకుంది. ఆదివారం ఉదయం పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుదిపట్లబైలు జనసంద్రంగా మారింది. పార్టీ నేతలు, అభిమానుల సందడితో హోరెత్తింది. ‘విజయీభవ’ అంటూ పల్లెజనం రాజన్న బిడ్డను ఆశీర్వదించారు. 250 మంది గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. నూటొక్క మంది మహిళలు ఒకేసారి సామూహికంగా హారతులు పట్టారు. మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కిటకిటలాడుతున్న జనం మధ్య పార్టీ అధినేత కొంతసేపు బందీ అయ్యారు. డప్పుల మోత, సాంస్కృతిక నృత్యాలతో యాత్ర జాతరను తలపించింది. వేలాది మంది జనం రాజన్నబిడ్డను ఆహ్వానించేందుకు హాజరయ్యారు.
No comments:
Post a Comment