3 January 2018

బ‌రితెగించిన టీడీపీ నేత‌లు

- సీఎం స‌భ‌లో ఎంపీపై అధికార పార్టీ నేత‌ల దౌర్జ‌న్యం
వైయ‌స్ఆర్ జిల్లా:  టీడీపీ నేత‌ల అరాచ‌కాలు రోజు రోజుకు శ్రుతిమించిపోతున్నాయి. ప‌బ్లిక్‌గా, ప‌ట్ట‌ప‌గ‌లే ప్ర‌జాప్ర‌తినిధిపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డుతున్నారు. ఇవాళ  వైయ‌స్ఆర్ జిల్లా పులివెందుల‌లో నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతుండ‌గా టీడీపీ నేత మైక్ లాక్కున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స‌మ‌క్షంలోనే అవినాష్‌రెడ్డిని టీడీపీ నేత‌లు, మంత్రులు చుట్టుముట్టారు. స్టేజీపై వైయ‌స్ అవినాష్‌రెడ్డి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పులివెందుల‌కు నీరు తెచ్చార‌ని నిజాలు చెప్పే క్ర‌మంలో టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోయారు. ఏకంగా చంద్ర‌బాబే  అడ్డుత‌గిలి మాట్లాడ‌కుండా అడ్డుకున్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ఎంపీపై ప‌బ్లిక్‌గా దౌర్జ‌న్యం చేయ‌డం ప్ర‌జాస్వామ్యంలో మాయ‌ని మ‌చ్చ‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్రోత్స‌హించ‌డం సిగ్గు చేటు.  

No comments:

Post a Comment