5 January 2018

మొబైల్ ఫోన్ డేటా లీకేజిపై స‌మాధానం చెప్పాలి

న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్‌ ఫోన్‌ డేటా లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై స‌మాధానం చెప్పాల‌ని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌ సభ్యులు విజయసాయి రెడ్డి ప్ర‌శ్నించారు. రాజ్య‌స‌భ‌లో ఆయ‌న అడిగిన ప్రశ్నకు  కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు.మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న అంగీక‌రించారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు.మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్‌ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా  పరిశీలన జరిపిందని మంత్రి స‌మాధానం చెప్పారు. 
- రాజ‌ధానికి నిర్మాణానికి నిధులు కేటాయించాల‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కు నిధులు కేటాయించ‌డం లేద‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. 

No comments:

Post a Comment