5 January 2018

ఏడాది ఆగండి..మన జగనన్న వస్తున్నాడు

చిత్తూరు: మరో ఏడాది ఆగితే మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. సదుం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ మన జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆందోలన వ్యక్తం చేశారు. పుంగనూరు అంటే వివక్ష చూపుతున్నారని, నీరు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మన కష్టాలన్నీ కూడా ఒక్క సంవత్సరమే అని, మన రాజన్న కుమారుడు వైయస్‌ జగన్‌ వస్తారని ధైర్యం చెప్పారు. మన కష్టాలు తీరుస్తారని భరోసా కల్పించారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందని మిథున్‌రెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment