5 January 2018

మరీ ఇంతనీచంగా పాలిస్తారా?

చిత్తూరు: చంద్రబాబు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి నిరుపేదల మరుగుదొడ్ల డబ్బులు దాకా అన్ని టీడీపీ నేతలు తినేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో 600ల వాగ్ధానాలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులకు ఇండ్లు, రేషన్, పెన్షన్‌ అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. చంద్రబాబు పాలన మొత్తం ఒక వర్గానికి మేలు జరిగే విధంగా ఉందన్నారు. గతంలో దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి కులం, మతం, వర్గ బేధాలు లేకుండా అడిగిన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. కానీ అధికారం దక్కించుకున్న చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ తరహాలు సువర్ణ పరిపాలన అందించేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల ముందుకు వచ్చారన్నారు. ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలే కుండా పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకొని అందరికీ ఉపయోగపడేలా.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జననేత మేనిఫెస్టో తీసుకురానున్నారన్నారు. చిత్తూరులో చంద్రబాబు మూసివేసిన షుగర్‌ ఫ్యాక్టరీలను, చిత్తూరు డెయిరీని తెరిపించింది అప్పుడు వైయస్‌ఆర్‌ అయితే.. ఇప్పుడు వైయస్‌ జగన్‌ తెరిపిస్తారన్నారు. అంతే కాకుండా పులిచర్ల, రొంపిచర్ల మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. 

No comments:

Post a Comment