5 January 2018

గత జన్మభూమి అర్జీలు ఏవీ నెరవేర్చలేదు

హైదరాబాద్‌: గత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చినీ ఆర్జీలు ఏవీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు సీఎం కాగానే 19 లక్షల ఇళ్లు కట్టిస్తానని, 2 లక్షల పింఛన్లు, 4 లక్షల రేషన్‌కార్డులు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నీవు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతో జన్మభూమిలో ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు.  ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ కు ప్రజలు తమ సమస్యలు వివరిస్తున్నారని చెప్పారు. 

No comments:

Post a Comment