22 December 2017

జ‌న‌మే జ‌గ‌న్‌

విజయవాడ: పుట్టిన రోజు కూడా వైయ‌స్ జగన్ ప్రజల మధ్యే వున్నారని, జ‌న‌మే జ‌గ‌న్ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య‌శిబిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో 13 దేశాల‍్లో చక‍్కర్లు కొట‍్టడం తప‍్ప సాధించింది ఏమీలేదని  విమర్శించారు. రాష్ర‍్ట అభివృద్ధిని గాలికి వదిలిన చంద్రబాబు దేశాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.   ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు పోలవరం విషయంలోనూ నిర‍్లక్ష‍్యం వహిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయ‌స్ఆర్‌సీపీ కట్టుబడిఉందని, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత‍్వంలోనే పోలవరం, ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ‍్యక‍్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును నిర‍్మించాల్సిన బాధ‍్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర‍్కొన్నారు. ప్రజా సమస్యలపై అన్ని వర్గాలను చైతన్యవంతం చేయడమే ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యమని చెప్పారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment