వైయస్ఆర్ జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రామిరెడ్డి పల్లె వాసులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. బుధవారం గ్రామానికి వెళ్లిన వైయస్ జగన్ వారి సమస్యలు ఓపికతో విని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్కూల్లో చెడిపోయిన గుడ్లు ఇస్తున్నారని విద్యార్థులు, నిరుద్యోగ భృతి అందలేదని నిరుద్యోగులు, రుణాలు అందలేదని డ్వాక్రా మహిళలు, బ్యాంకులో రుణాలు అందడం లేదని రైతులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగాలు ఇప్పించాలని యువకులు వైయస్ జగన్ను కోరారు. అంతకుముందు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున వైయస్ జగన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జననేతతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని, అందరికి మంచి జరుగుతుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. రామిరెడ్డి పల్లెలో జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి వైయస్ జగన్ రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
No comments:
Post a Comment