15 November 2017

మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించండి


–వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే పాదయాత్ర
– రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు ఇలా అందర్ని చంద్రబాబు మోసం చేశాడు
–  మీరు దిద్దింది, మీరు చెప్పిందే మన పార్టీ మ్యానిఫెస్టోలో ఉంచుతా
– మీ అందరి సలహాలు సూచనలతో రెండు పేజీల మ్యానిఫెస్టో ∙
– మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం
– ఇవాళ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి
– చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.
– నాలుగేళ్ల పాలనలో టీడీపీ వేసిన కమిషన్లు ఏమయ్యాయి?
– రాజకీయాల్లో విశ్వసనీయత అర్థం తీసుకువచ్చేందుకే పాదయాత్ర 
–  ఆళ్లగడ్డలో వైయస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం

కర్నూలు: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్రగా బయలుదేరానని, ప్రతి ఒక్కరు మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఆయన ఎండగట్టారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో అన్ని కూడా సవివరంగా వైయస్‌ జగన్‌ తెలిపారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 9వ రోజు వైయస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సాయంత్రం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకున్న రాజన్న బిడ్డకు  స్థానికులు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
– ఇన్ని వేల మంది ఇవాళ నాతో అడుగులో అడుగులు వేశారు. ఇవాళ ఏ ఒక్కరికి ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన అవసరం లేకపోయిన వచ్చి సంఘీభావం లె లుపుతున్నారు. నడిరోడ్డు అని కాతరు చేయడం లేదు. ఇంటికి వెళ్లాలన్న సాకులు వెతకడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి ఆత్మీయతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.
– ఇవాళ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. టీడీపీ పాలనలో మనకు మంచి జరిగిందా? చెడు జరిగిందా అన్నది ప్రశ్నించుకోవాలి. నాలుగేళ్ల పాలన చూశాం. నాయకత్వంలో మనమేదైతే ఆశీస్తామో మనకు రావాల్సింది వచ్చిందా అన్నది ఆలోచించాలి. నాయకుడు అన్న వాడు ఎలా ఉండాలి అని మనం అనుకుంటాం. మన బిడ్డ ఎలా ఉండాలని మనం ఆశీస్తాం. మన నాయకుడు ఎలా ఉండాలని అని అందరూ భావిస్తారు. 
– సినిమాలో కూడా మనకు నచ్చేది హీరోనా? విలనా? ..హీరోనే నచ్చేది. కారణం ఏంటంటే వాళ్లు ప్రవర్తించిన తీరు, గుణగణాలు ఇవన్ని కూడా నాయకత్వాన్ని చూపిస్తాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్న తరునంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇదే చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలా అన్నది ప్రశ్నించుకోవాలి.
–దారి పోడువునా నాకు అర్జీలు ఇచ్చారు. ఉద్యోగులు వచ్చి అన్న చంద్రబాబు పాలనలో వేగలేకపోతున్నామని చెప్పారు. ఏడాదిగా అడుగుతున్నా రెండు డీఏలు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 
–దారి పోడుగునా అవ్వ, తాతలు కనిపించారు. మాకు పింఛన్‌ రావడం లేదని, ఇల్లు లేదని ప్రతి నోట వినిపిస్తోంది.
– ప్రతి రైతన్నల దగ్గర నుంచి పంటలకు గిట్టుబాటు ధర లేదన్న అని చెబుతున్నారు. పంటలు అమ్ముకోలేక, అప్పుల బాధ తట్టుకోలేక అధ్వాన్న స్థితిలో ఉన్నారు.
– అన్నా..బ్యాంకుల గడప ఎక్కలేకపోతున్నాం. అప్పులు పుట్టడం లేదని వాపోతున్నారు.
–చదువుకుంటున్న పిల్లలు వచ్చి అన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. లక్షల్లో ఫీజులు ఎలా చెల్లించాలని పిల్లలు అడుగుతున్నారు.
–పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు వచ్చి అన్నా..ఆ రోజు పావలావడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
– మీ అందర్ని అడుగుతున్నాను..నాలుగేళ్ల పాలనకు ముందు మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చేది..ఇవాళ ఎంత వస్తుంది..రూ.500, 600, ఇష్టం వచ్చినట్లు బాదుదే బాదుడు. డబ్బు కట్టకపోతే కరెంటు కత్తరిస్తామని బెదిరింపులు
–టీడీపీ పాలనలో అడుగుతున్నా..రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప నిత్యావసర వస్తువులు ఇవ్వడం లేదు. గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిపప్పు, పామాయిలు, గోదుమ పిండి, కిరోసిన్, చింతపండు దొరికేది.
– ఎన్నికల సమయంలో చంద్రబాబు మైక్‌ పట్టుకొని ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క ఇల్లు కట్టించాడా?
– రైతులను మోసం చేశాడు, అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు. రైతులకు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బంగారం ఇంటికి వచ్చిందా? మీ రుణాలు మాఫీ అయ్యాయా?. వడ్డీలకైనా సరిపోతున్నాయా?
– ఆడవాళ్ల ఉసురు తగులుతుందన్న ధ్యాస కూడా చంద్రబాబుకు లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశాడు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు.  ఇవాళ ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తానని చెప్పాడు. కోటి 75 లక్షల ఇల్లు ఉన్నాయి. 45 నెలలకు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు.
–ఇంతటి దారుణంగా రాజకీయాలు జరుగుతున్నప్పుడు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం లేకుండా చేసేందుకు నిసిగ్గుగా సంతలో గొ్రరెలను కొనుగోలు చేసేందుకు ఆరాటపడుతున్నారు. కొంతమందికి డబ్బు ఇస్తారు. కొంత మందికి మంత్రి పదవులు ఇస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
–చట్టాలను కాపాడాల్సింది ఎమ్మెల్యేలు. అటువంటి సభలోనే ఎమ్మెల్యేలను గొ్రరెలను కొనుగోలు చేసినట్లు కొంటున్నారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదంటూ, వారిపై అనర్హత వేటు వేయాల్సిన పని లేదంటూ వారికి కాపాడుకుంటున్నారు. వారిని చట్టసభలో కూర్చోబెట్టుకుంటున్నారు. మంత్రి పదవులు పొందిన మొట్టమొదటి సభలో మేం కూడా పాల్గొంటే వారు చేసిన అన్యాయానికి ఒప్పుకున్నట్లు అవుతుందని, ఇవాళ అసెంబ్లీకి రామని చెప్పాం. అప్పుడైనా చంద్రబాబుకు సిగ్గు వస్తుందని సమావేశాలను బహిష్కరించాం.
– రెండు రోజుల క్రితం 22 మంది బోటు బోల్తా పడి చనిపోయారు. రెండు రోజుల తరువాత మాట్లాడుతున్నాను.  అసెంబ్లీలో టీడీపీ నేతలు ఏం చేశారో తెలుసా. అసెంబ్లీలో సంతాపం తెలిపారు. వదిలేశారు. ఒక మంత్రి రాజీనామా చేయలేదు. సీఎం రాజీనామా చేయలేదు. సీఎం ఇంటికి కొన్ని గజాల దూరంలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. కూతవేట దూరంలో బోటు మునిగిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదట. చంద్రబాబు నీవో..నీ కొడుకో విమానం ఎక్కు. విమానం నడిపే డ్రైవర్‌కు లైసెన్స్‌ లేకపోతే మీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. పర్మిషన్‌లేని బోటుకు టికెట్లు అమ్మి ఎందుకు ఎక్కించారు. ఇంతదారుణంగా మనుషులు చనిపోతే అడిగే నాథుడు లేడు.
–ఇంతకు ముందు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్‌లో ఈయన హీరోగా కనిపించేందుకు ఈయనకు కేటాయించిన ఘాట్‌లో స్నానం చేయకుండా ప్రజా ఘాట్‌లో గంట సేపు స్నానం చేశారు. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. బాద్యులేవురు. కమిషన్లు ఉండవు, నివేదికలు లేవు.
–చిత్తూరులో ఎ్రరచందనం స్మగ్లర్లు అంటూ కాల్చి చంపారు. ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే 21 మందిని కాల్చేస్తారా? ఆ కమిషన్‌ ఏమైంది.
–రిషితేశ్వరి అనే విద్యార్థిని ^è నిపోతే ఆ కమిషన్‌ ఏమైంది?
– నడిరోడ్డుమీద ఓ ఎమ్మెల్యే ఇసుక తోడుకుంటుంటే ఓ ఎంఆర్‌వో ప్రశ్నిస్తే ఆ మహిళా అధికారినిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు.
–విజయవాడలో ఆడవాళ్లను సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నారు. టీడీపీకి చెందిన నాయకులు అందులో ఉన్నారు. ఆ కమిషన్‌ ఏమైంది?
– విజయవాడలో చంద్రబాబు నివాసం ఉంటున్న చోట ట్రాన్స్‌పోర్టు కమీషనర్, కానిస్టేబుల్‌ను ఓ ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లి గొడవ పడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ కమిషన్‌ ఏమైంది.
– జన్మభూమి కమిటీ పేరుతో ఓ మాఫియాను తయారు చేశారు. 
– వ్యవస్థలు దాయనీయంగా తయారయ్యాయి. ఇసుక నుంచి మట్టి దాకా, బొగ్గు నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో మాఫియా, లంచాలు తీసుకొని ఒక్క పని లేదు. చంద్రబాబు చేయని మాఫీయానే లేదు.
–రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. అలాంటి వారి కోసం పాదయాత్ర మొదలుపెట్టాను.
– 44 లక్షల పింఛన్లు ఉంటే ఇవాళ తగ్గుతు పోతున్నాయి. అవ్వతాతలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నాను.
– పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్ర మొదలుపెట్టాను.
– చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందకపోవడంతో ఆ పిల్లలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర మొదలుపెట్టా
–ఉద్యోగాలు లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో పాదయాత్ర ద్వారా కాలినడన బయలుదేరాను.
– నవరత్నాలు  ఇది వరకే ప్రకటించా. అందులో మార్పులు చేర్పులు ఉంటే సలహాలు తీసుMýంంటాను. ప్రతి సామాజిక వర్గాన్ని కలుసుకుంటూ 3 వేల కిలోమీటర్లు వెళ్తాను.
– చంద్రబాబు మాదిరిగా కట్టకట్టలుగా మ్యానిఫెస్టోలు తయారు చేయను. రెండు పేజీల మ్యానిఫెస్టో రూపొందిస్తాం.
– రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి మార్పు రావాలన్న ఆశతో పాదయాత్ర చేపట్టాను.
– మీరు దిద్దిందే మ్యానిఫెస్టోలో ఉంటుంది. 2019 ఎన్నికల్లో పెట్టి 2024లో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేశామని, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశానని మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి వద్దకు వస్తాను. ఈ ముద్దు బిడ్డను ఆశీర్వదించండి.
– ఎన్నికలప్పుడు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతానని హామీ ఇచ్చారన్నా..ఇప్పుడేమో చేస్తాం, చూస్తామని అంటున్నారని చెబుతున్నారు. ఇలా అందర్ని మోసం చేశాడు. మీ అందరికి తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు.
– ప్రమాదంలో ఓ తల్లి ఒళ్లు కాలిపోయింది. ప్రభుత్వం మాత్రం పింఛన్‌ ఇవ్వడం లేదు. ఈ తల్లి విషయంపై కలెక్టర్‌కు లేఖ రాస్తాను.
–మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి ఊర్లో సచివాలయం ఏర్పాటు చేసి, గ్రామంలోనే 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. వారి ద్వారా మీ సమస్యలు 72 గంటల్లోనే పరిష్కరిస్తాం.

No comments:

Post a Comment