17 November 2017

మ‌ద్యం దుకాణం తొల‌గించాల‌ని ధ‌ర్నా

అనంత‌పురం: తాడిపత్రి ప‌ట్ట‌ణంలో జ‌నావాసాల మ‌ధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ను తొల‌గించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. జనావాసాల మధ్య ఉన్న హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని, వెంటనే దాన్ని మూసివేయాలని వైయ‌స్ఆర్ సీపీ నేత పెద్దారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన‌ వారిని అడ్డుకునేందుకు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు పెద్దఎత్తున అదే ప్రాంతానికి తరలిరావ‌డంతో ఉధ్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.

No comments:

Post a Comment