- బాబు చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు
- బ్యాంకుల్లో బంగారాన్ని కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ః ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా మహిళల రుణామాఫీ అమలు కాకపోవడం వల్లే కాల్మనీ-సెక్స్రాకెట్లు పుట్టుకొచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే మీ ఇంటికి రప్పిస్తానని హామీనిచ్చిన చంద్రబాబు దానిని గాలికి వదిలేశారని పద్మ ఫైర్ అయ్యారు. బ్యాంకు రుణాలు రాక మహిళలు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండడంతో.... దీనిని అసరాగా చేసుకొన్న కొందరు కాల్మనీ పేర వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. బాబు మోసపూరిత హామీల వల్ల మహిళలు నాశనం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మ ఇంకా ఏమన్నారంటే......
- డ్వాక్రా సంఘాల ముఖ్యోద్దేశం మహిళ సాధికారత... అటువంటి మహిళలను చంద్రబాబు నిండా ముంచుతున్నారు.
- బాబు మాటలు నమ్మి ఓట్లేసినందుకు మహిళలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న బంగారాన్నికూడా పోగోట్టుకుంటున్నారు.
- రెండేళ్లయిపోయినా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయడం కాదు కదా కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు.
- బాబు రుణమాఫీని అమలు చేయకపోవడం వల్ల ఏ గ్రేడ్లో ఉన్న డ్వాక్రా సంఘాలు ఒక్కసారిగా సి-గ్రేడ్కు పడిపోయాయి.
- కాల్మనీ-సెక్స్రాకెట్లో నిందితులుగా ఉన్నవారంతా సీఎం పక్కన కూర్చుంటే తప్పు కాదు గానీ,
- ఒక గుమస్తాను విధులు సక్రమంగా నిర్వహించమన్నందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అక్రమ కేసులు పెడతారా.
- ఇప్పటికైనా డ్వాక్రా మహిళల రుణాలపై చంద్రబాబు తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్
- గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో బాబు చేసిన మోసాలపై ప్రజలు తమ గోడుకు వెల్లబోసుకుంటున్నారు.
No comments:
Post a Comment