గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమ కష్టాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పంచుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో గడపగడపలో పర్యటించారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని చిట్టిబాబు ధ్వజమెత్తారు.
గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని కె.ముర్వకొండ, వీరాపురం, నేహ్రునగర్, పగిడ్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే ఐజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతి, మోసాలను వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త సి.హెచ్.నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. అవినీతి, అక్రమాలే లక్ష్యంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని నారాయణరెడ్డి ఆగ్రహించారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలిచేస్తున్నారని నిప్పులు చెరిగారు.
No comments:
Post a Comment