26 March 2016

విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం

  • స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలే బట్టబయలు చేసిన కుంభకోణం
  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 4..5 వేల కోట్ల రూపాయిల మేర కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వసంస్థలే స్వయంగా బయట పెట్టినా, చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవటం లేదని పేర్కొన్నారు. అయినా సరే, దీన్ని అంగీకరించకుండా ప్రభుత్వం బుకాయిస్తోందని ఆయన వివరించారు. అసెంబ్లీలో విద్యుత్ పద్దుల మీద జరిగిన చర్చలో వైఎస్ జగన్ గణాంకాలతో సహా ఈ విషయాల్ని బట్ట బయలు చేశారు.
      ప్రస్తుతం విద్యుత్ రౌండ్ ది క్లాక్ అంటే 24 గంటలకూ 2 రూపాయిల 71పైసలకు, రాత్రి సమయంలో 1రూపాయి 90 పైసలకు దొరుకుతోంది. అంటే సగటున 2 రూపాయిల 40 పైసలకు దొరికే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 రూపాయిల 11పైసలకు కొనుగోలు చేస్తోందని వైఎస్ జగన్ వివరించారు. దీని మీద స్వయంగా కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ఉండే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన నోట్ లో  ఈ కొనుగోళ్లను ఆక్షేపిస్తూ కామెంట్ రాశారని వెల్లడించారు. దీన్ని నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లు జరిగిన మొత్తం గణాంకాల్ని ఆయన చదివి వినిపించారు. 

No comments:

Post a Comment