18 March 2016

నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..!

హైదరాబాద్ : శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని చూస్తుంటే అసలు నిజంగా..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో ఏం జరిగింది అనేది అందరూ చూస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యే రోజా ను ప్రభుత్వం అడ్డుకోవటంతో శాసనసభ దగ్గర వైఎస్ జగన్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ నరసింహన్ లేకపోవటంతో ఆయన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ దగ్గర వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..
      చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను చేతుల్లోకి తీసుకొని పెడదోవ పట్టిస్తున్నారనేది చూస్తున్నాం. శాసనసభలో స్పీకర్ అనే వ్యక్తి రూల్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనలు అనుమతించక పోయినా కానీ ఎమ్మెల్యే రోజమ్మను సస్పెండ్ చేయటం చూశాం. నిబంధన 340 ప్రకారం సస్పెండ్ చేశామని చెబుతున్నారు.  కానీ,  ఈ నిబంధన ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ వరకు మాత్రమే సస్పెండ్ చేయటానికి వీలవతుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
తర్వాత అసెంబ్లీలో జరుగుతున్న దుర్మార్గాల్ని ఒక్కొక్కటిగా వైఎస్ జగన్ వివరించారు. 

No comments:

Post a Comment