6 February 2016

కులాల కుంపటి రాజేస్తున్న చంద్రబాబు

కాపుల్ని ఇరుకొని పెట్టేందుకు వ్యూహాలు
బీసీ లను రెచ్చగొడుతున్న చంద్రబాబు
పనిలో పనిగా తన పబ్బం గడుపుకొంటున్న బాబు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న సూక్తిని బాగా ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎవరిని బలి పెట్టడానికైనా వెనుకంజ వేయనే వేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు.

కాపు రిజర్వేషన్ లకు బీసీల పేరుతో అడ్డు
ఎన్నికల వేళ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని పార్టీ వేదికల మీద ఇదే విషయాన్ని ఊదర గొట్టారు. ఓట్లు వేయించుకొన్నాక, ఎప్పటిలాగే మోసం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ అది ఫలించక పోవటంతో రూట్ మార్చారు. బీసీలను రెచ్చగొట్టడం మొదలెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్రిష్ణయ్య ను హైదరాబాద్ నుంచి పిలిపించి మరీ రంగంలోకి దింపారు. బీసీలను కూడగట్టి ప్రకటనలు ఇప్పించటంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో విష బీజాలు నాటే పనిలో పడ్డారు.

బీసీలు, కాపులకు కొట్లాట
చంద్రబాబు నాయుడు కోరుకొంటున్న దిశగా పావులు కదిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎగువ కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల కాపులు, బీసీలకు గ్రామాల్లో, పట్టణాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. దీన్ని వేదికగా చేసుకొని రెండు సామాజిక వర్గాల మధ్య  చిచ్చు రగిల్చారు. దీంతో అన్నిచోట్ల వాతావరణం వేడెక్కింది.

చప్పుడు కాకుండా పనులు షురూ...!
రెండు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టిన చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేసుకొంటున్నారు. గడచిన 20 నెలల పరిపాలన కాలంలో ప్రధాన హామీలు అయిన రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి వాటికి తూట్లు పొడిచారు. వీటిని గాలికి వదిలేసి, ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజధాని పేరుతో అంతటినీ సింగపూర్ బినామీ కంపెనీలకు అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఈ ప్రయత్నాల నుంచి ప్రజల ఆలోచనల్ని పక్కకు మళ్లించేందుకు ఈ సామాజిక కుంపటి ని వాడుకొంటున్నారు. కానీ, చంద్రబాబు స్వార్థం కోసం ఇటువంటి రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడటం సరైన చర్య కాదనే మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. 

No comments:

Post a Comment