3 February 2016

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం..!

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రెండు కళ్ల సిద్ధాంతానికి తెర దీశారు. పరిపాలన మీద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అసహనాన్ని కులాల మధ్య చిచ్చులా మార్చేందుకు ఎడ తెగని ప్రయత్నాలు చేస్తున్నారు.

హామీల మీదే కాపుల పోరు
రిజర్వేషన్ లు కోరుతూ కాపులు చేస్తున్న పోరాటం ఇప్పటిది కాదు. దశాబ్దాల కాలం నుంచి పోరు సాగుతోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో కాపుల రిజర్వేషన్ ఒకటి. దీంతో పాటు ఐదేళ్ల లో రూ. 5వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వటం లేదు. దీంతో కాపులు తిరగబడ్డారు. ఉద్యమ పథం తొక్కుతున్నారు.

బీసీల్ని రెచ్చగొట్టిన బాబు
ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు తన పాత అయిడియాను బయటకు తీశారు. మాదిగలు, మాలలకు చిచ్చు పెట్టినట్లుగానే ఇప్పుడు కాపులు, బీసీలు మధ్య చిచ్చు పెట్టేందుకు పథకం రూపొందించారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు క్రిష్ణయ్య కు  ఈ పని అప్పగించారు. బీసీలను పూర్తిగా రెచ్చగొట్టి ఆందోళనలకు దిగేట్లుగా పథకాలు రచించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తాము సహించబోమని బీసీల నాయకుల చేత చెప్పించారు.

రెండు కళ్ల సిద్ధాంతం అమలు..
ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వర్గాల్ని విభజించు..పాలించు సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ లోని నాయకుల్ని స్వయంగా పిలిపించుకొని ఆయా వర్గాలతో మాట్లాడమని పురమాయిస్తున్నారు. సహజంగానే గోదావరి జిల్లాల్లోని అనేక చోట్ల కాపులు, బీసీల మధ్య వైరం ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకొని రెండు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టే పనికి వ్యూహాత్మకంగా పదును పెడుతున్నారు. 
చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడు

No comments:

Post a Comment