9 February 2016

నాయకుల్ని తప్పు దోవ పట్టిస్తున్న చంద్రబాబు

త్వరలోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ అంటూ వదంతులు
నాయకుల మధ్య విభేదాలు పుట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు
2026 దాకా పునర్ వ్యవస్థీకరణ లేదని తేల్చి చెప్పిన అధికారులు

న్యూఢిల్లీ:  రాజకీయ ముఖచిత్రంలో నాయకుల మధ్య విభేదాలు పుట్టించేందుకు చంద్రబాబు, ఆయన మంత్రులు కొత్త ఎత్తుగడకు దిగారు. త్వరలోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక్కసారిగా 220 దాకా పెరిగిపోతాయని పుకార్లు పుట్టించారు.

ఎందుకీ పుకార్లు..!
పదేళ్ల క్రితమే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, లేదా ఎమ్మెల్యే అభ్యర్థుల ఆధారంగానే రాజకీయ శక్తుల ఏకీకరణ జరుగుతోంది. దాదాపుగా టీడీపీ, వైఎస్సార్సీపీ తరపు నుంచి ఆయా నియోజక వర్గాల ఆధారంగానే రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముఖచిత్రాన్ని ఛిద్రం చేసేందుకు, నాయకుల్లో అపోహలు పుట్టించేందుకు టీడీపీ పన్నాగం పన్నుతోంది. అందుకే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోందని పుకార్లు పుట్టించారు. దీంతో నాయకుల్లో కంగారు పుట్టి టీడీపీ అగ్ర నేతల దగ్గరకు పరుగులు తీస్తారని అంచనా వేసుకొని ఎత్తుగడలు పెట్టుకొన్నారు.

ఎన్నికల సంఘంతో వైఎస్సార్సీపీ నేతల భేటీ
ఈ చిల్లర రాజకీయాల్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతల బ్రందం న్యూఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. పునర్ వ్యవస్థీకరణ కు సంబంధించి వస్తున్న వదంతుల్ని అధికారుల ముందు ఉంచారు. ఇప్పట్లో పునర్ వ్యవస్థీకరణ ఊసే లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జనాభా లెక్కలు, ఇతర గణాంకాల ఆధారంగా చూసుకొంటే 2026 దాకా నియోజక వర్గాల విషయంలో మార్పు లేదని తేల్చి చెప్పారు. అటు, కేంద్రానికి న్యాయ సలహా అందించే అటార్నీ జనరల్ వర్గాలు కూడా దీన్నే నిర్ధారించాయి.

No comments:

Post a Comment