11 February 2016

ఎల్లో మీడియాతో కలిసి బాబు మైండ్ గేమ్

తెలంగాణలో టీడీపీని అమ్ముకున్న చంద్రబాబు
ఏపీలో కూడా తుడుచుకుపెట్టుకుపోతుందని భయం
పార్టీ  కనుమరుగవుతుందని ప్రతిపక్షంపై  దుష్ప్రచారం

వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వస్తున్నారంటూ చంద్రబాబు దుష్ర్పచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని అమ్మేసుకున్న చంద్రబాబు...అక్కడ ప్రజల దృష్టి మరల్చేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాబు మైండ్ గేమ్ కు ఎల్లో మీడియా బాజాలు చరుస్తోందని ధ్వజమెత్తారు. తమకు పత్రికలపైనా, జర్నలింజంపైనా ఎంతో గౌరవముందని..ఆగౌరవాన్ని దిగజార్చుకోవద్దని ఎల్లోమీడియాకు సూచించారు.  

టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకే ప్రతిపక్షంపై ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని శ్రీకాంత్ రెడ్డి  స్పష్టం చేశారు. టీడీపీ మునిగిపోతున్న నావ అని.. అందులో ఎవరెక్కుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో మా సంకల్పం చెదిరిపోదని శ్రీకాంత్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణలో టీడీపీ తుడుచుకు పెట్టుకుపోవడంతో..... ఏపీలో కూడా పార్టీ కనుమరుగవుతుందని  చంద్రబాబు భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

తెలుగుదేశంలోకి వెళ్లిపోతున్నారంటూ చంద్రబాబు వందతులు  క్రియేట్ చేయడం సమంజసం కాదన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం చౌకబారు రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడరని...అదంతా చంద్రబాబు చేస్తున్న దుష్ర్పచారమని కొట్టిపారేశారు.  పార్టీ పట్ల తాము విశ్వాసంతో ఉన్నామని  ఘంటాపథంగా చెప్పారు. 

No comments:

Post a Comment