2 February 2016

ఆనాడు ఉద్యమకారుని చంపేశావ్

చంద్రబాబుది క్రిమినల్ బుద్ధి
రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాడు
కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడు
బాబు చరిత్రంతా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటు
కాపుల సక్సెస్ ను ఓర్వలేక..మోహనరంగాను చంపించాడు

హైదరాబాద్ః  కాపుల మీటింగ్ జరిగితే ఉద్యమకారులకు, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందన్న కక్షతో..చంద్రబాబు ఇతర పార్టీలకు చెడ్డపేరు ఆపాదిస్తున్నారని  ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇందుకోసం బాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాడని ఫైరయ్యారు. కాపుల మీటింగ్ ఆపాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేశాడని దుయ్యబట్టారు. మీటింగ్ కు ఎవరూ హాజరుకావొద్దని బాబు కాపు టీడీపీ నేతలను హైదరాబాద్ కు పిలుపించుకున్నారన్నారు. కాపులకు అరకొరగా బస్సులు ఇచ్చి...మీటింగ్ కు 7,8 కి.మీ. దూరంలో వాటిని ఆపేసి..చంద్రబాబు వారిని రకరకారలుగా ఇబ్బందులు పెట్టారని జననేత విమర్శించారు. 

క్రిమినల్ బుర్ర నీది కాదా బాబు..
కాపులను మీటింగ్  దగ్గరకు  వెళ్లనీయకుండా వారి ప్రస్టేషన్ తో ఆడుకున్నావ్.  నీలో అసలు మానవత్వం  అంటూ వైఎస్ జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆరోజు ఏం జరిగిందో మీకు తెలియదా బాబు.  ముద్రగడ పద్మనాభం మాట్లాడినవెంటనే భావాద్వోగేల మధ్య రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు అందరూ  రైల్వేస్టేషన్ దగ్గరకు వెళ్లారు. ప్రతి ఛానల్ టెలికాస్ట్ చేసింది.  కానీ ఆరు ఛానల్ లు మాత్రమే టెలికాస్ట్ చేశాయంటూ మాట్లాడుతున్నాడు.  రేపు పొద్దున్న కాపుల ఉద్యమాన్ని కవరేజ్ చేయకూడదని బాబు మీడియాను బెదిరిస్తున్నాడు. క్రిమినల్ బుర్ర నీది కాదా బాబు అని జననేత ఫైరయ్యారు. 

రంగాను చంపేశారు..
1984లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది. అదే సభ 88లోనూ జరిగినప్పుడు ...ఆ సక్సెస్ ను తట్టుకోలేక చంద్రబాబు వంగవీటి మోహనరంగాను చంపించాడని జననేత తెలిపారు. చంద్రబాబు ప్రమేయంతోనే  హత్య జరిగిందని... అప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రి హరిరామ జోగయ్య పుస్తకం రాశాడన్నారు. మోహన రంగాను చంపిన ఇద్దరు ముద్దాయిలు ఇప్పుడు పదవిలో ఉన్నారన్నారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్ పోస్ట్ లో ఉంటే దేవినేని ఉమ మంత్రి పోస్ట్ లో ఉన్నాడని, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వైఎస్ జగన్ కుండబద్ధలు కొట్టారు.  దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న చంద్రబాబుదే క్రిమినల్ బుద్ది అని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. ఇవేనా బాబు నీ రాజకీయాలు. రాజకీయాలంటే స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలి అని చెప్పారు. 

కులాల మధ్య చిచ్చు పెడుతున్నావ్..
బీసీలకు నష్టం జరగకుండా కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టలేదా చంద్రబాబు..? ఇప్పుడు బీసీలు ఒప్పుకోవడం లేదని మీ పార్టీ బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్ మెంట్ ఇప్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.  మీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కృష్ణ య్య లేడా బాబు అని నిలదీశారు . చంద్రబాబు కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెడుతున్నాడని... గతంలోనూ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మాల, మాదిగల  మధ్య చీలిక తెచ్చాడని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం అందరి మధ్య చిచ్చుపెట్టేది చంద్రబాబు అయితే ..ఆనింద వేరేవాళ్లపై వేస్తున్నాడని విరుచుకుపడ్డారు. నాయంత గొప్ప నాయకుడు లేడంటాడు. సెల్ ఫోన్లు నేనే తెచ్చానంటాడు.ఇవన్నీ వినాల్సిరావడం మా కర్మ అని వైఎస్ జగన్ బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అబద్ధాలు, మోసం, వెన్నుపోటు..
చంద్రబాబు పాలనలో ఏపీ ఐటీ ఎగుమతుల్లో 8.66 పర్సంట్ షేర్ ఉంటే ....వైఎస్సార్ హయాంలో 14.93 పెరిగింది. ఉద్యోగుల విషయానికొస్తే బాబు ఉన్నప్పుడు  85,945 పనిచేస్తే ...రాజన్న హయాంలో 2 లక్షల 64 వేల 737 వేల మంది పెరిగారు. అది రాజశేఖర్ రెడ్డి గొప్పతనం. ఇక టర్నోవర్  2003-4 లో 58వేల కోట్లు అయితే ..వైఎస్సార్ హయాంలో 2,41, 950 కోట్లకు పెరిగింది. ఇవన్నీ వాస్తవాలు ఇయితే చంద్రబాబు వాటిని వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇవన్నీ వినాల్సిరావడం ప్రజల కర్మ,  మాకర్మ అని వైఎస్ జగన్ వాపోయారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుని మించిన వారెవరు లేరని,  నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు డిమాండ్ కు సంపూర్ణంగా మద్దతిస్తున్నామని, బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో... మద్దతిచ్చే పార్టీల్లో వైఎస్సార్సీపీ ముందుంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

అది వైఎస్సార్ గొప్పతనం..
1910-1956 దాకా  కాపులు బీసీల్లో ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లకే కాపులను జీవో ద్వారా తొలగించారు. తిరిగి బీసీల్లో చేర్చాలని కాపులు చేస్తున్న పోరాటం సహేతుకమని వైఎస్ జగన్ తెలిపారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.  నీవు మద్దతిస్తున్న బీజేపీ కేంద్రంలో ఉంటే...ఏం చేస్తున్నావని  చంద్రబాబును వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.  అసెంబ్లీలో  తీర్మానం చేసి  కేంద్రం దగ్గర పెడితే... బీసీలకు నష్టం రాకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వవచ్చన్నారు.ఇక  కమిషన్ వల్ల ఎలాంటి లాభాలు లేవని,  బాబు వేసిన కమిషన్ కు దశ, దిశ లేదని జననేత ఎద్దేవా చేశారు.  చంద్రబాబు కమిషన్ కు మార్గదర్సకాలు ఇవ్వాల్సిందిపోయి..కమిషన్, రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే తానేమీ చేయలేననడం  దుర్మార్గమన్నారు.  మేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీ నెరవేర్చడు. చివరకు మంత్రులను కూడా ఉపసంహరించుకునే దమ్మూ, ధైర్యం చేయడంలేదని బాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర అంతా నోరు తెరిస్తే అబద్ధం, చేసేవన్నీ మోసాలేనని అన్నారు.  

ఏపీలో గ్రోత్ రేట్ 11.76 పర్సంట్  ఉంది. 15 శాతం తీసుకుపోతామన్న ఇదే చంద్రబాబు... జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చాలా ఇబ్బందులున్నాయని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కేంద్రమే ఆర్నెళ్ల కాలానికి 7.3 పర్సంట్ జీడీపీ చూపించిందని జననేత తెలిపారు. తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న రీతిలో చంద్రబాబు అబద్ధాలు ఆడుతుంటారని వైఎస్ జగన్ ఆగ్రహించారు. 

కబడ్డీలో తొడగొట్టి..అమరావతిలో ఒలింపిక్స్ అంటాడు..
చంద్రబాబు వైజాగ్ కు పోతాడు. తొడగొట్టి అమరావతికి ఒలింపిక్స్ తెస్తానంటడు. చైనాలో ఒలింపిక్స్ జరిపించడం కోసం చైనీస్ గవర్నమెంట్ 42 బిలియన్ డాలర్లు(మూడున్నర లక్షల కోట్లు) ఖర్చుపెట్టింది. జీతాలిచ్చేందుకు డబ్బులేలేవన్న చంద్రబాబు అమరావతిలో ఒలింపిక్స్ పెడతాననడం విడ్డూరమన్నారు. సింగపూర్ పోతాడు, వస్తాడు. అమరావతిని సింగపూర్ చేస్తానంటడు.  చైనాకు పోతాడు, వస్తాడు. అమరావతిని బీజింగ్ చేస్తానంటడు. దావోస్ పోయివచ్చి స్విట్జర్లాండ్ చేస్తానంటడు. ఇంకా నయం రెండు కొండలు పెట్టి మంచు కురిపిస్తాననలేదంటూ బాబుపై వ్యాంగ్యాస్త్రం సంధించారు. ఇంత దారుణంగా  అబద్ధాలు ఆడే వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని వైఎస్ జగన్ అన్నారు.  అందరూ కలిసికట్టుగా సాధించేదిశగా సంయమనంతో ముందుకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఏం జరిగినా చంద్రబాబు చెడ్డపేరు ఆపాదిస్తారని జననేత వ్యాఖ్యానించారు.  

No comments:

Post a Comment