1 February 2016

చంద్రబాబు క్రిమినల్ నం.1

బాబు చెప్పేవన్నీ అబద్ధాలు,చేసేవన్నీ మోసాలు
చంద్రబాబు తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలి
నేరాలన్నీ చంద్రబాబు చేస్తూ..
ప్రతిపక్షాలపై అభాండాలు వేస్తున్నాడు

హైదరాబాద్ః రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జన ఘటనపై చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు దారుణంగా ఉందని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తప్పులన్నీ చంద్రబాబు చేస్తూ ఆనెపం ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు ఈస్థాయిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. తలతోక లేకుండా మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

నోరు తెరిస్తే అబద్ధాలే..
కాపు రిజర్వేషన్లు సహా అనేక అంశాలపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జననేత ఫైరయ్యారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలన్నారు.  చంద్రబాబు రకరాకల ఆరోపణలు చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ప్రతిపక్షాలు  చిచ్చు పెడుతున్నాయంటూ అంభాడాలు వేస్తున్నాడు.  ఆరు ఛానళ్లకు మాత్రమే ఎలా తెలిసిందంటూ కాపుల ఉద్యమాన్ని కవర్ చేయకూడదని మీడియాను బెదిరిస్తున్నారు. 

అవతలి వారిపై అభాండాలు..
తలతోక లేని మాటలన్నీ మాట్లాడాడు. పట్టిసీమ నుంచి కాల్ మనీ దాకా మాట్లాడాడు. నేరస్తులు, కరప్షన్,  డబ్బులు స్పాన్సర్ అంటాడు. కాపులు 5 శాతమే పాల్గొన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. పులివెందులలో జరిగినా పర్వాలేదు. ఈస్ట్ గోదావరిలో ఇలా జరగడం బాధాకరమంటాడు. బీసీలు ఒప్పుకోవడం లేదంటాడు. జీతాలు ఇవ్వలేకపోతున్నామంటాడు. వేసిన కమిషన్ ఒప్పుకోకపోతే కాపులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఏమీ చేయలేమంటాడు. కానీ, కాపులకు పలానా చేస్తానన్న మాట ఎక్కడా చెప్పలేదు. ఆశ్చర్యమనిపించింది. చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు అవతలివారిపై అంభాడాలు వేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది

నీవు కాదా బాబు హామీ ఇచ్చింది..?
కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత కాలవ్యవధిలోనే బీసీలకు నష్టం జరగకుండా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు నీవు కాదా బాబు చెప్పిందని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. ఏడాదికి రూ. వేయి కోట్ల చొప్పున  ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. చంద్రబాబు నీవు అధికారంలోకి వచ్చి 20 నెలలయిపోయింది. హామీలు ఎందుకు అమలు చేయడం లేదని కాపులు ఉద్యమబాట పడితే..... దానికి సమాధానం చెప్పకుండా అవతలి వాళ్లపై అభాండాలు వేయమేంటని దుయ్యబట్టారు. అసలు ఈయన ముఖ్యమంత్రేనా అని అనిపిస్తోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 

బాబుపై ప్రజల్లో అసహనం..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు ...చంద్రబాబుపై అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల్లోని ప్రజల్లో ప్రస్టేషన్ ఉందని వైఎస్ జగన్ అన్నారు. రైతులు, డ్వాక్రాలకు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చెప్పలేదా బాబు. టీవీలు, పత్రికల్లో  ప్రకటనలు ఇవ్వలేదా బాబు..?  మరి నీవు మోసం చేసినప్పుడు క్రిమినల్ నం.1 అని ఎందుకు అనకూడదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పావ్. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నావ్. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి అన్నావు. ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి నిన్ను క్రిమినల్ అని ఎందుకు అనకూడదు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. 

క్రిమినల్ నం.1 చంద్రబాబు..
బీసీలకు నష్టం జరగుకుండా కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ముందు చెప్పావ్.  ఇవాళ చేయడం లేదు. అలాంటి  నిన్ను క్రిమినల్ నం.1 అని ఎందుకు అనకూడదు చంద్రబాబు. అనంతపురం వెళ్లి బోయలను ఎస్టీల్లో చేరుస్తానన్నావ్. ప్రతి కులానికీ, వర్గానికీ, ప్రాంతానికీ మోసం చేశావు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తే..కేపిటల్ కు వ్యతిరేకమని అంభాండాలు వేస్తున్నావ్. అదే మీ మంత్రి నారాయణ, సుజనా చౌదరి, ఎంపీ మురళీ మోహన్ భూములను మాత్రం తీసుకోరు. రైతులు, ఎస్సీ, ఎస్టీలపై  ఒత్తిడి తెచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు.... పైగా  వైఎస్సార్సీపీకి ఇష్టం లేదని అభాండాలు వేస్తున్నారు.

చెంప చెల్లుమనిపిస్తారనే..
పోలవరం ముద్దు పట్టిసీమ వద్దు అంటే.. కమిషన్లు, లంచాల కోసం పట్టిసీమను తీసుకొచ్చారు. దానిపై నిలదీసినందుకు  రాయలసీమకు వైఎస్సార్సీపి వ్యతిరేకమని అభాండాలు వేస్తున్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. డీజీని కలిసిన ఫోటోలు ఉన్నాయి. ఆడియోలు, వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. సెక్స్ రాకెట్ లో  మీ అందరి ప్రమేయం ఉంది. ఐనా, అరెస్ట్ చేయరు. పైగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. బలంవంతంగామహిళల  జీవితాలను నాశనం చేస్తున్నావని ప్రశ్నిస్తే..వీళ్లు విజయవాడకు వ్యతిరేకమంటూ వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారు. కాపులు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కదిలారు. మేనిఫెస్టో పెట్టిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. బీజేపీ కన్నా లక్ష్మినారాయణ కూడా వచ్చారు. ఐనా, చంద్రబాబు బీజేపీ వాళ్లను ఏమైనా అంటే చెంపచెల్లుమనిపిస్తారని..కావాలనే ఇతర పార్టీలపై బురజల్లుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment