నెల్లూరుః స్థానిక జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన తీరుని ఎండగట్టారు. ఆయన ప్రసంగంలోని పవర్ ఫుల్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం..
1. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఆరోపణలు రుజువు చేయాలి.
2. కుప్పంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ప్రాజెక్ట్ టెండర్లలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. కమిషన్ ల కోసం చంద్రబాబు, ఆయన కొడుకు.. చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై దొంగకేసులు పెట్టే స్థాయికి దిగజారడం సిగ్గుచేటు.
3. మిథున్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టి ఉంటే.. సీసీ పుటేజ్ ఎందుకు చూపించడం లేదు?
4. చంద్రబాబును ఒక్కటే డిమాండ్ చేస్తున్నా...మిథున్ చేయి చేసుకొని ఉంటే సీఐఎస్ ఎఫ్ పోలీసులు లేరా..మిథున్ కొట్టి ఉంటే కేసు పెట్టేవారే కదా.
5. సమైకాంధ్ర ఉద్యమం కేసు అని చెప్పి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే సన్మానించాల్సిందిపోయి...అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం.
6. జైల్లో చెవిరెడ్డిపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. గోడల మీద రాతలు రాశాడని చెప్పి అతనిపై మరో అక్రమ కేసు పెట్టి పీలేరుకు తరలించే కుట్ర చేస్తున్నారు.
7. దగ్గరుండి ఇంత అన్యాయమైన పాలన సాగిస్తున్న చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.
8. ప్రజలు, పైనుంచి దేవుడు అంతా గమనిస్తున్నారని...చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెబుతారు.
9. ఖచ్చితంగా చంద్రబాబుకు అందరి ఉసురు తగులుతుందని...రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో పడిపోతాడన్నారు.
10. ఎల్లకాలం ఇలాగే ఉండదు, ఏదైతే విత్తుతామో అదే పండుతుంది, ఖచ్చితంగా చంద్రబాబుకు ఇదే పరిస్థితి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
No comments:
Post a Comment