ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలన మొత్తం మోసాల చుట్టూ తిరుగుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభివర్ణించారు. వారం రోజుల పాటు సాగిన రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్.. చంద్రబాబు పరిపాలన తీరుని ఎండగట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
1. చంద్రబాబు నిర్వాకంతోనే అక్కచెల్లెమ్మలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
2. ఎన్నికల సమయంలో చంద్రబాబు బాగా గొప్పలు చెప్పారు. మహిళలు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టొదు. బ్యాంకు అధికారులు అడిగితే కట్టేది లేదని నిక్కచ్చిగా చెప్పండని ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా హామీలు గుప్పించారు. తీరా పీఠమెక్కాక హామీలన్నింటినీ అటకెక్కించారు.
3. అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇవ్వటమే లేదు.
4. కనీసం ఆత్మహత్యలు చేసుకొంటున్నవారిని ఆదుకోవటం లేదే..!నేను వస్తున్నానని తెలిసే వాళ్లు ఆర్థిక సాయం ఇస్తామని చెబుతుంటారు.. తీరా నేను వెళ్లిపోయాక సమస్య మళ్లీ మొద టికొస్తుంది
5. బాబు చేసిన నిర్వాకం వల్లే అందరిపైనా వడ్డీ భారం పడింది.
6. మంచి రోజులు వస్తాయి.. అంతవరకు ఓపికపట్టండి.
7. ఈ ప్రభుత్వం మీకు సాయం చేయకపోయినా మా ప్రభుత్వం వచ్చాక మీకు ఆర్థిక సాయం అందిస్తాం.
8. పింఛన్లపై కోర్టులో కేసు వేసి మీకు న్యాయం జరిగేలా చూస్తా.
9. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబసభ్యులకు పరిహారం అందే లా చూస్తాం.
10. రైతులు, చేనేత కార్మికులు, ఇతర ఆపన్నులకు అండగా ఉంటామని చెప్పి జన నేత వైఎస్ జగన్ తన పర్యటనను ముగించారు.
No comments:
Post a Comment