13 May 2015

తమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్న ‘నీరు-చెట్టు’

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది. చెరువుల్లో పూడిక తీసి, మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రారంభమైన నీరు-చెట్టు పథకం తమ్ముళ్ల జేబులు నింపే పథకంగా మారిపోయింది. అధికార పార్టీ సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు అధికారులు వంతపాడుతుండడంతో వారిపని నల్లేరు మీద బండి నడకలా మారింది. ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లి కొండవద్ద సర్వే నెంబర్ 475 భూమి అటవీ భూమి అని అటవీశాఖ, కాదని రెవెన్యూశాఖ మధ్య ఐదేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ భూమిని  క్వారీ కోసం లీజుకు తీసుకున్న నాగరాజుపల్లి గ్రామస్తుడొకరుహైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇంత వివాదాస్పదమైన ఆ భూమిలో తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని తవ్వకాలు మొదలుపెట్టారు. వివాదాస్పద భూమి సమీపంలోనే ఉన్న ఇసుకదర్శి గ్రామంలో నీటి గుంతలలో పూడిక తీయడం కోసం అనుమతులు తీసుకున్న తెలుగుదేశం నాయకులు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో కూడా తవ్వకాలు మొదలుపెట్టారు. పూడిక తీయడానికి బదులు మట్టిని తవ్వేస్తున్న తెలుగుదేశం నాయకులు ఆ మట్టిని హైవే పనుల కోసం అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై క్వారీ అనుమతులు తీసుకున్న లీజుదారుడు అధికారులను ఆశ్రయించినా వారు తామేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అధికార పార్టీ అంటే మాటలా మరి... 

No comments:

Post a Comment