14 May 2015

వైఎస్ జగన్ హెచ్చరికతో దిగివచ్చిన ప్రభుత్వం

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్
విజయవాడః రాష్ర్టంలోని ఆర్టీసీ కార్మికులంతా ఐకమత్యంగా ఉండి సమ్మె చేయడం వల్లే న్యాయపరమైన డిమాండ్లు సాధించుకోగలిగారని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్ చెప్పారు. బుధవారం రాత్రి ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ సమ్మెకు పూర్తిస్థాయిలో మద్దతు పలికి అన్ని పోరాటాల్లో పాల్గొందని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన హెచ్చరికతోనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల డిమాండ్లు పరిష్కరించిందని చెప్పారు. ప్రభుత్వం వందలాదిమంది కార్మికులను అరెస్ట్ చేయించడం, వేలాదిమందిపై కేసులు బనాయించడం, అనేక చోట్ల కార్మికులపై లాఠీచార్జి చేసి నిరంకుశంగా వ్యవహరించడం వంటివాటికి పాల్పడిందని మండిపడ్డారు. కార్మికులు ఐకమత్యంతో ఉంటే ప్రభుత్వం ఏమీ చేయలేదని మరోమారు రుజవైందని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు మాట మార్చడానికి యత్నించారన్నారు. దీనిద్వారా ఆయన మోసకారి అని మరోసారి రుజువైందన్నారు.

No comments:

Post a Comment